Sunday 21 March 2010

వీకెండ్ కథలు

ఈ ఆదివారం (21/03/2010) చదివిన కథలు:
ఈనాడు - పునాది రాళ్ళు
ముందుగా కథ కంటే, ఇతివృత్తం నన్ను ఇబ్బంది పెట్టింది. మార్ఫింగ్ లాంటి పనులు జరిగే అవకాశం ఉన్నా అవి ఎంతో మందికి తెలియదు ఇంకా. అలాంటి కథావస్తువు తీసుకుని కథ వ్రాసి ఈనాడు లాంటి పెద్ద పత్రిక లో ప్రచురిస్తే, ఇప్పుడు అది తెలియనివారికి కూడా తెలుస్తుంది. అంతే తప్ప ఈ కథ వల్ల వేరే ఉపయోగం నాకేమీ కనపడలేదు. దినపత్రిక లాంటి శక్తివంతమైన మాధ్యమం లో ఇలాంటి కథలు, దానికి తగ్గ బొమ్మలు పూర్తి గా అనవసరం.
కథని విశ్లేషిస్తే, రచయిత స్త్రీ స్వాభిమానాన్ని సమర్ధించారు, బాగుంది. కాని ఎన్నుకున్న దారి చాలా పొరపాటు, నిజ జీవితానికి చాలా దూరంగా ఉన్న పరిష్కారం. నా దృష్టి లో ఇంకా చాలా చదివి అప్పుడు వ్రాయడం మొదలు పెడితే, కథ లో ఇతివృత్తము యొక్క ప్రాధాన్యత తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఇంకా మంచి రచయిత కాగలరు.

అంధ్ర భూమి - జీవన స్రవంతి
జీవన స్రవంతి కథ లో ఏదో చెయ్యాలనే కోరిక నిద్రాణంగా ఉన్న ఎందరో గృహిణులు కనబడతారు. కాకపోతే అందరి అప్ప్రోచ్ ఒకేలా ఉండదు. కాని రచయిత్రి చూపిన కోణం బావుంది. కాకపొతే, పిట్ట కథ లాంటి దానమ్మ, ఆమె కు సంబంధించిన అన్ని సన్నివేశాలు వృధా. అది అంతా తీసేస్తే, కథ చిన్నది అయినా, ఫోకస్డ్ గా ఉండేది. ఇంకా పరిణితి చూపిస్తే, మంచి రచనలు చెయ్యగలరు అని నా నమ్మకం.

అంధ్ర జ్యోతి - పరబ్రెహ్మం
ఈ కథ ని ఒక్క సారి చదివి ఒదిలేస్తే లాభం లేదు. ప్రతీ రోజు, ప్రతీ సారి, రైతుల కి జరిగే అన్యాయాలని చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోదగ్గది. అప్పుడే ఈ కథ కి సార్థకత. అంత సామాజిక స్పృహ ఉన్న కథ ఇది. కోడిగుడ్డు కి ఈకలు పీకినట్టు ఈ కథ లో పాత్రల న్యాయాలు చూడకుండా సారాంశాన్ని తీసుకుంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ తెలుసుకుంటారు. ఆకొన్న వారికి ఒక ముద్ద అన్నం పెడతారు. చాల మంచి ఇతివృత్తం. బాధించినా బాగున్న కథ ఇది.


No comments:

Post a Comment